యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో తారక్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని చెప్పాలి.తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్పైనే ఫోకస్ పెట్టాడు.ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో రాబోయే సినిమాను ఇప్పట్లో మొదలుపెట్టే ఆలోచనలో లేడట తారక్.కాగా ఇతర హీరోలు బాలీవుడ్లో తమ అడుగులు ముందుకేస్తూ దూసుకుపోతున్నా, ఇప్పటివరకు తారక్ బాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న సినిమా చేయలేదు.
దీంతో తన నెక్ట్స్ మూవీని ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నాడు.ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు తారక్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అటు స్టైలిష్ స్టార్ బన్నీ త్రివిక్రమ్తో కలిసి చేసిన ‘అల వైకంఠపురములో’ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
దీంతో తారక్ కూడా తన నెక్ట్స్ మూవీని ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది.