నందమూరి సుహాసిని ! కూకట్ పల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి తలపడుతోంది.ఈమె పేరు ఖరారు అయినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఆమె ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే నందమూరి కుటుంభం సభ్యులు రంగంలోకి దిగబోతున్నారు అంటూ… అనేక వార్తలు కూడా వినిపించాయి.

బాబాయ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు ఏపీ మంత్రి పరిటాల సునీత.సుహాసినికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.డిసెంబర్ మొదటి వారంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు ప్రచారం నిర్వహించనున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు, ఈ నెల 27, 28 తేదీల్లో సుహాసినితో కలిసి ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రచారాన్ని చేపట్టబోతున్నారు.







