కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే భేటీ ముగిసింది.
సమావేశం అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ నిన్నటి తన వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ విధంగా సిద్ధమవాలనే దానిపై చర్చించామని చెప్పారు.ముందస్తు ఎన్నికలు గురించి చర్చ జరిగిందన్న ఆయన తన అభిప్రాయాలను ఠాక్రేకు వివరించినట్లు తెలిపారు.
ఈ మేరకు అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కోరానన్నారు.గతంలో టీడీపీ పొత్తుతో పార్టీకి నష్టం జరిగిందని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పొత్తులు వద్దని చెప్పానని వెల్లడించారు.