పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.నిన్నటి వరకు బీజేపీతో ఉన్న జనసేనాని ఇవాళ టీడీపీతో ఉంటానని తేల్చి చెప్పారని తెలిపారు.
ఉమ్మడి పొత్తుపై బీజేపీ నాయకత్వం సరిగా స్పందించకపోవడంతోనే పవన్ కల్యాణ్ టీడీపీతో ఉంటానని ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎన్ని జెండాలు కలిసి వచ్చినా తమది మాత్రం ఒకటే జెండా అని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేనతో పాటు మిగతా పార్టీ నేతలు అందరూ కలిసి వచ్చినా సరే వైసీపీనే మరోసారి అధికారంలో వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.







