Nizamabad District : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిప్యూటీ తహసిల్దార్ నిర్వాకం.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో( Armoor ) దారుణ ఘటన జరిగింది.డిప్యూటీ తహసిల్దార్ నిర్వాకంతో ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు.

ఆర్మూర్ చౌరస్తా వద్ద శివరాం( Sivaram ) అనే వ్యక్తి కార్ల అద్దాలను క్లీన్ చేస్తూ యాచిస్తున్నాడు.ఈ క్రమంలోనే సిగ్నల్ వద్ద డిప్యూటీ తహసిల్దార్ కారు అద్దాలు తుడిచిన తరువాత శివరాం డబ్బులు అడిగాడు.

దీంతో ఆ వ్యక్తిని డిప్యూటీ తహసిల్దార్( Deputy Tehsildar ) కాలితో తన్నడంతో లారీ కింద పడి చనిపోయాడు.లారీ శివరాంపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు.దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వ్యక్తి చనిపోయిన తరువాత డిప్యూటీ తహసిల్దార్ ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు