టాలీవుడ్ నటి, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ కొంతవరకు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.
కానీ ఈ మెగా ప్రిన్సెస్ కు వెండితెరపై అంతగా కలిసి రాలేదు.కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.
ఆ తర్వాత అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.ఇక వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.గతంలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఓ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక గతంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది.
సోషల్ మీడియాలో మాత్రం ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.
తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.
పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరికింది.
కానీ ఆ ఫ్రీడమ్ గతంలో తనను బయటకి రాకుండా చేసింది.పైగా సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది.ఇంతకు అసలేం జరిగిందంటే.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిహారిక గతంలో తన ఇన్ స్టా వేదికగా ఒక ఫన్నీ వీడియో షేర్ చేసుకుంది.అందులో తన జిమ్ ట్రైనర్ వీపు మీద కూర్చొని ఉండగా ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.
దీంతో తన అత్తింటి వాళ్ళు ఈ విషయం పట్ల బాగా ఫైర్ అయినట్లు తెలియడంతో నిహారిక తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసినట్లు తెలిసింది.ఇక ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో పోలీసుల అదుపులో నిహారిక చిక్కిన సంగతి తెలిసిందే.
ఇక దాంతో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
నాగబాబు కూడా తన కూతురు తప్పు లేదు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పే ప్రయత్నం చేశాడు.అయినా కూడా నిహారికది తప్పు ఉంది అంటూ చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు.ఇక వీటివల్లనే నిహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని.
ఒకప్పటి ఫ్రీడం కూడా కోల్పోయిందని.కాలు బయటకు పెట్టాలన్న ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవలసిన పరిస్థితి వచ్చిందని తెలిసింది.
ఇక ఇన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా తాజాగా ఇన్ స్టా లో అడుగు పెట్టింది.ఇక ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది.
ఇక అందులో ఏముందంటే.తను ఎనిమిది వారాల బ్రేక్ నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవే అంటూ.
ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదని, ఇతరులు ఏం చేస్తున్నారు అన్నది నేను పట్టించుకోను అని, ఇప్పుడు నేను నిజంగా రిఫ్రెష్ అయ్యాను అని.పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను అని తెలిపింది.