తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజా రాణి సినిమాతో ఊహించిన విధంగా పాపులారిటీని సంపాదించుకుంది నజ్రియా నజీమ్.
కేవలం ఈ ఒక్క సినిమాతోనే తెలుగు, తమిళం,మలయాళం భాషల్లో భారీగా అభిమానులను సొంతం చేసుకుంది.ఇక రాజా రాణి సినిమాలో ఆమె నటనకు ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు.
ఇకపోతే నజ్రియా నజీమ్ పిక్స్ లో ఉన్న సమయంలో ఆమె హీరో ఫాహద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసిన నజ్రియా ఆ తరువాత నాలుగేళ్లకు సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది.కూడే అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది నజ్రియా నజీమ్.ఇక అంటే సుందరానికి సినిమాలో నటించిన విషయం తెలిసింది.
కాగా నజ్రియా నజీమ్ కు ఇది మొదటి తెలుగు సినిమా.ఇకపోతే నజ్రియా ప్రస్తుతం బోలెడు ఆఫర్లతో దూసుకుపోతుంది.
అంతేకాకుండా వలస సినిమా షూటింగ్ లతో తీరికలేని సమయం గడుపుతుంది.ఈ క్రమంలోని ఒక షూటింగ్ కోసం ఆమె థాయ్ ఎయిర్వేస్ విమానం ఎక్కగా అందులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
థాయ్ ఎయిర్వేస్ ట్రీట్మెంట్ సిబ్బంది తీరు పై ఆమె అసహనం వ్యక్తం చేసింది.దీంతో సదరు ఎయిర్వేస్పై మండిపడింది.ఈ క్రమంలోని తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీని రాసుకొచ్చింది నజ్రియా.థాయ్ ఎయిర్వేస్ ఓ చెత్త! నేనెప్పుడూ.ఏ ఎయిర్ వేస్తో కానీ, సిబ్బందితో కానీ ఇంత భయంకరమైన అనుభవాన్ని పొందలేదు.బ్యాగులు పోయాయి.
సహాయం కోసం వెళితే వాళ్లు పట్టించుకోలేదు.ఇంకోసారి నా జీవితంలో ఈ అద్భుతమైన థాయ్ ఎయిర్వేస్ ఎక్కను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నజ్రియా నజీమ్.