ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండగా కొన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయి.తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి జగన్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
సినిమా విడుదలైన రోజునే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా చూసే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ నిర్ణయం త్వరలో అమలులోకి రానుండగా ఈ నిర్ణయం గురించి నట్టి కుమార్( Natti Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ లో ప్రదర్శించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమాలను చూసే అవకాశం కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
ఈ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన తెలిపారు.
నిర్మాతల మండలిని, ఫిల్మ్ ఛాంబర్( Film chamber ) ను సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం ఎలా తీసుకుందని నట్టి కుమార్ అన్నారు.గతంలో ఇదే తరహా నిర్ణయాలు పలు డీటీహెచ్ లు అమలు చేయాలని చూసినా వర్కౌట్ కాలేదని ఆయన కామెంట్లు చేశారు.ఈ విధానం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వ్యవస్థ నాశనమైందని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి నిర్మాతలు వ్యతిరేకమని ఆయన తెలిపారు.
సినీ పరిశ్రమకు చెందిన వాళ్ల నిర్ణయాలు తీసుకోకుండా జగన్ సర్కార్ సొంత నిర్ణయాలను అమలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని కొంతమంది చెబుతున్నారు.జగన్ సర్కార్ నుంచి ఈ కామెంట్ల విషయంలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.నట్టి కుమార్ ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.