న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో.
ఆ తర్వాత అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ రెండు కూడా ఆశించిన విజయం అయితే అందించలేదు.
దీంతో నాని ఫ్యాన్స్ ఈయన నుండి సాలిడ్ హిట్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో ‘దసరా‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సాలిడ్ మాస్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.
ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.ఇక తాజాగా ఈ సినిమా నాని చేతికి చేరడం వెనుక చాలా కథ ఉందని వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు అసలు నానిని హీరోగా ముందు అనుకోలేదట.ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ తో చేయాలని అనుకున్నాడట.
చిన్న బడ్జెట్ తో ఈ సినిమా తీయాలని ట్రై చేసిన అది వర్కౌట్ అవ్వలేదట.అయితే ఒక మ్యాకప్ మ్యాన్ ద్వారా ఈ కథ నిర్మాత చెరుకూరి సుధాకర్ వరకు చేరడంతో ఆ స్టోరీ విన్న ఈయన డెమో తీసుకు రమ్మని చెప్పడంతో శ్రీకాంత్ డెమో వీడియో రెడీ చేసాడట.
ఈ వీడియో చుసిన సుధాకర్ బాగా నచ్చడంతో నానితో చేద్దాం అని చర్చలు జరిపి ఆయనకు కూడా డెమో చూపించడం ఓకే చెప్పడం జరిగింది.అయితే మినిమమ్ బడ్జెట్ తో తీయాలని అనుకుని ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో చేయడం ఇక్కడ విశేషం.
మరి నానికి ఈ కథ చేరాక ముందు తెర వెనుక ఇంత జరిగిందట.