మాటలు చెప్పి మోసం చేస్తావ్.. మహేష్ నిర్మాతపై అభిమానులు ఫైర్!

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ మధ్యకాలంలో సితారా,హారిక హాసిని బ్యానర్ల పై బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా శరవేగంగా నిర్మిస్తున్నారు.

ఇదీ ఇలా ఉంటే ప్రస్తుతం స్వాతిముత్యం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు నాగ వంశీ.

తగ స్వాతిముత్యం సినిమాలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన విషయం తెలిసిందే.దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబీ28 పాన్ ఇండియా సబ్జెక్ట్ అంటూ నాగ వంశీ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.ఈ టైటిల్ ను ప్రకటించిన తర్వాత చాలా రోజులకి సినిమాను ప్రారంభించారు.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ సమయంలో హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది అని తెలిపాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ.

కానీ తాజాగా మాత్రం నాగవంశీ ఈ సినిమాను కమర్షియల్ సినిమా అంటూ పేర్కొనడం తో మహేష్ అభిమానులు తప్పులు పడుతున్నారు.ఇంకొక రెండు నెలలు ఆగితే ఈ సినిమాను సందేశాత్మక సినిమా అంటూ ప్రకటిస్తాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం చెప్పడంతో మహేష్ అభిమానులు అసంతృప్తితో కనిపించడంతో పాటు ప్రొడ్యూసర్ నాగ వంశీ పై మండిపడుతున్నారు.

అంతేకాకుండా ఇంకా ఎన్ని మాటలు చెప్పి మోసం చేస్తావు అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు