టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత కెరీర్ పై పూర్తిగా దృష్టిని పెట్టారు.
అంతేకాకుండా వరుస సినిమా అవకాశాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.ఇది ఇలా ఉంటే విడాకులకు ముందు ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించని నాగచైతన్య విడాకుల తర్వాత మాత్రం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పలు పోస్టులను కూడా పెడుతున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా నాగచైతన్య సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్టును రాసుకోవచ్చాడు.
తాజాగా నాగచైతన్య తన థాంక్యూ మూవీ జర్నీ గురించి మాట్లాడుతూ తన తల్లి తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.అలాగే సామ్ పెట్ హష్ ని కూడా గుర్తు చేసుకున్నాడు నాగచైతన్య.
థ్యాంక్యూ అన్నది చాలా గొప్ప పదమని అయితే మనం చాలా సందర్భాలలో థాంక్యూ అన్న పదాన్ని ఉపయోగిస్తూ ఉంటామని కొన్ని సార్లు కొందరికి మనం ఎక్కువగా థాంక్యూ చెబుతుంటాం.
కొందరికి చెప్పలేం అయితే నా జీవితంలో ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి అంటూ తన తల్లి, తన తండ్రి, సమంత పెట్ హష్ ఫోటోలను షేర్ చేశాడు నాగ చైతన్య.
ఈ పోస్ట్ను నేను నా జీవితంలో అతి ముఖ్యమైన వారికి అంకితం చేస్తున్నాను.వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.మీరంతా కూడా మీకు జీవితంలో ముఖ్యమైన వారి గురించి చెబుతూ ఫోటోలను షేర్ చేయండి.అమ్మ.నాకు ప్రాణం,చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తూ ప్రేమగా పెంచి అనంతమైన ప్రేమను పంచింది.నాన్నా ఓ స్నేహితుడి కంటే ఎక్కువగా నాతో ఉంటూ,నాకు మార్గాన్ని చూపించారు.
అలాగే హష్ ఎలా ప్రేమించాలి మనిషిలా ఎలా ఉండాలి అనేది నేర్పించింది అంటూ ఇలా తన జీవితంలో ఇంపార్టెంట్ అయిన వారి గురించి చై చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.ఇక సమంత, నాగ చైతన్యలు హష్కు ఎంత అడిక్ట్ అయ్యారో అందరికీ తెలిసిందే.
కానీ ఇప్పుడు హష్ మాత్రం నాగ చైతన్యకు దూరంగా, సమంతకు దగ్గర ఉంటోంది.