తెలంగాణ బిజేపి నేత మోత్కుపల్లి నరసింహులు టిఆర్ఎస్ ఎంఎల్ఏ ధర్మారెడ్డి పైన, కేసిఆర్ పైన విమర్శలు చేశాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మారెడ్డి ని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు.
కేసిఆర్ తెలంగాణ ద్రోహి అని అన్నాడు.టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఆత్మ గౌరవం దెబ్బతినేల వ్యవహరిస్తుందని అన్నాడు.
దళితులను అవమానిస్తే చూస్తూ ఊరుకోము అని అన్నాడు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అవినీతికి పాల్పడినట్లుగా ఆయన చెప్పాడు.
ఈ నేపథ్యంలో కేసిఆర్ కి సవాల్ విసిరాడు ! ఈ పది ఏళ్లలో కేసిఆర్ ఎంత ఆస్తులు సంపాదించాడో నా ముప్పై ఏండ్ల రాజకీయంలో ఎంత ఆస్తి సంపాదించానో ఓసారి చూసుకుందామా అంటూ ఛాలెంజ్ చేశాడు.మరో వైపు చర్ల టిఆర్ఎస్ ఎంఎల్ఏ ధర్మారెడ్డి వ్యాఖ్యలపై బిసి జాతీయ అధికార ప్రతినిది దాసు సురేశ్ హెచ్ఆర్సి లో పిర్యాధు చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి కూడా పాస్ కానీ ధర్మారెడ్డి కి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించాడు.ఆయనను తక్షిణమే ఎంఎల్ఏ పదవికి అనర్హుడు గా ప్రకటించాలని కోరాడు.
తెలంగాణ కాంగ్రెస్ మాజీ మంత్రి వి హనుమంత రావు ధర్మారెడ్డి పై వెంటనే కేసిఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.