సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్‎తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు.హైదరాబాద్ ప్రగతిభవన్ లో వీరి సమావేశం జరుగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేసీఆర్ తో కవిత చర్చిస్తున్నారు.ఈ క్రమంలోనే సీబీఐ అధికారులతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారని సమాచారం.

రేపు కవిత నుంచి వివరణ తీసుకోవాలని సీబీఐ భావిస్తుంది.మరోవైపు సీబీఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.రేపు వివరణ ఇవ్వలేనన్న ఆమె 11, 12.14, 15 తేదీల్లో హైదరాబాద్ లోని ఇంట్లో అందుబాటులో ఉంటానని చెప్పారు.ఈ మేరకు ఏ రోజు వివరణ తీసుకుంటారో ఖరారు చేయాలని సీబీఐను లేఖలో కవిత కోరిన విషయం తెలిసిందే.

వీవీప్యాట్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు..!

Advertisement

తాజా వార్తలు