బొంతు రాజేశ్వరరావుపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బొంతు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ 151 సీట్లు గెలిస్తే బొంతుకు సత్తా లేక రాజోలులో ఓడిపోయారని విమర్శించారు.32 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావించానన్నారు.దానిని ఇప్పుడు జరిగినట్లు ప్రచారం చేయడం తగదని రాపాక సూచించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభ పెట్టిందన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.గత ఎన్నికల్లో తనకు ఓటు వేసింది జన సైనికులేనని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు.




తాజా వార్తలు