కడప జిల్లా ప్రొద్దుటూరు: టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సీరియస్ కామెంట్స్.ప్రజా గౌరవ సభల పేరుతో మా అందరికి సోదరి సమానులైన చంద్రబాబు తన సతీమణి శీలాన్ని బజారు కీడిచామని బాధాకరం.
ఒక స్త్రీని ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా ఒకే గౌరవమే.
ఎవరు ఏ మహిళను కించపరిచినా అది తప్పే.
ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని నేను ఒక ఎమ్మెల్యే గా విజ్ఞప్తి చేస్తున్నా.
భువనేశ్వరి అక్క కూడా తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించ పరిచారని భావించి ఉంటే ఆమె అనుమతి ఇస్తే ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతాం.ఆనాడు సత్యహరిశ్చంద్రుడు ఇచ్చిన మాటకోసం భార్య ను చక్రవర్తి ఇంటికి పనికి పంపితే ఈనాడు ఈ చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం, తన భార్య శీలాన్ని బజారు కీడిచారన్న మాటలు మానుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తి.