ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది.మొత్తం ఏడు స్థానాలకు గాను ఎనిమింది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
రాత్రి లోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు టీడీపీ అభ్యర్థితో పాటు ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులు లెక్కింపు కేంద్రంలోకి వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి.