బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) కారు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.సదాశివపేట్(Sadasivpet ) దర్గాలో ప్రార్థనల కోసం లాస్య కుటుంబ సభ్యులు వెళ్లారని సమాచారం.ఈ మేరకు వారు రాత్రి 1.30 గంటలకు వెళ్లారు.
తరువాత సదాశివపేట్ నుంచి లాస్య కుటుంబ సభ్యులు మూసాపేట్ కు వచ్చారు.లాస్య అక్క కుమార్తెకు పరీక్షలు ఉండటంతో కుటుంబ సభ్యులు అంతా మూసాపేట్ లోనే ఉన్నారు.అయితే ఆకలి వేయడంతో ఎమ్మెల్యే లాస్య, డ్రైవర్ ఆకాశ్( Driver Akash ) బోయిన్ పల్లి నుంచి మళ్లీ సదాశివపేట్ కు వెళ్లారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆమె కారు ఫ్రంట్ సీట్లో కూర్చొన్నారు.
కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో కారు ప్రమాదానికి గురైందని, ప్రమాద సమయంలో కారు 100 స్పీడ్ లో ఉందని తెలుస్తోంది.మరోవైపు లాస్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో ఆమె భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు.