మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఈ ఘటనలో పదహారేళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు.
ఈ 16 ఏళ్ల బాలుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.బుధవారం వైద్యం కోసం భర్త, కొడుకు బయటకు వెళ్లగా ఆ మహిళ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది.ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కూడా మాయమయ్యాయి.
విచారణలో, అదే గ్రామానికి చెందిన బాలుడి ఈ హత్య చేసినట్లు తాను అనుమానిస్తున్నట్లు మృతురాలి కుమారుడు పోలీసులకు చెప్పాడు.రెండేళ్ల క్రితం ఈ బాలుడు టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చి మొబైల్ ఫోన్ దొంగిలించాడట.అప్పుడు అందలించగా అదే మనసులో పెట్టుకొని ఈ బాలుడు తమ కుటుంబాన్ని శత్రువులుగా భావించాడని ఆమె కొడుకు చెప్పాడు.
చట్టం ప్రకారం, ఇతర సాక్ష్యాలను సమర్థిస్తే తప్ప, పోలీసులకు ఇచ్చిన ఈ వాంగ్మూలం కోర్టులో సాక్ష్యంగా పరిగణించబడదు.జడ్జి ముందు చేసిన వాంగ్మూలం నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యంగా పరిగణించబడుతుంది.ఇది ఇలా ఉండగా పోలీసులు బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇంత దారుణంగా ఆ మహిళ ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేస్తున్నారు.
పదహారేళ్ల బాలుడు ఇంత దారుణానికి వడిగట్టడమేంటని చాలామంది షాక్ అవుతున్నారు.కోర్టు అతడిని దోషిగా తేలుస్తుందా? నిజంగా ఈ ఘోరాన్ని అతడు చేశాడా? అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.