పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో నాలుగవ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని.ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న పథకాలను వివరిస్తూ ప్రతి ఒక్కరితో పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ వీధి వీధి తిరుగుతున్న మంత్రి రజిని.
అమే మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు.
బీసీలంతా జగన్ వైపే అన్నారు.అది చూసి తట్టుకోలేక చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.గతంలో ఐదు సంవత్సరాలు కాలంలో బీసీల కోసం చంద్రబాబు చేసిందికేవలం 19 వేల కోట్లు మాత్రమే.
అదేవిధంగా జగనన్న ఈ మూడున్నర సంవత్సరాలలో బీసీలకు లక్ష 65 వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.బీసీలు అంతా జగనన్న వైపే ఉన్నారు.కావాలని కొన్ని పత్రికలు ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని అబద్ధాలు రాస్తున్నాయి.