రేపటి నుండి పాఠశాల ప్రారంభం యధావిధిగా కొనసాగుతోంది.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్.రేపటి నుండి పాఠశాల ప్రారంభం యధావిధిగా కొనసాగుతోంది.

రెండేళ్లుగా కరోనా వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తం మారింది.అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేసాం.

ఆన్ లైన్ పాఠాలు ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు అందేలా చేశాం.టెట్ ఎగ్జామ్ నిర్వహణ బాగా జరిగింది.

రేపటి నుంచి బడులు ఓపెన్ చేస్తున్నాం.పిల్లలందరికీ కూడా స్కూల్స్ కి స్వాగతం పలుకుతున్నాం.

Advertisement

అన్ని ఏర్పాట్లు చేయాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇచ్చాం.ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం.అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన.1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన.1 నెల బ్రిడ్జ్ క్లాసెస్ లాగా నిర్వహించాలని టీచర్లకు చెప్పాం.యథావిధిగా బుక్స్ అందిస్తాం, యూనిఫార్మ్స్ కూడా అందిస్తాం.

ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచన.ప్రభుత్వం స్కూల్స్ లో టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకోవాలని కోరుతున్నాం.

మిషన్ భగీరథ అన్ని స్కూల్స్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.రేపు స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న స్కూల్స్ లో పిల్లలకి స్వాగతం పలకాలని కోరుతున్నాం.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు