టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు రోజురోజుకు పిచ్చి ముదిరిపోతుందన్నారు.
బాబుకు పిచ్చి శృతిమించే ప్రజలకు లేఖ రాశారని తెలిపారు.ఆయన పిచ్చి వాగుడు మానకపోతే మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తామన్నారు.
చంద్రబాబు రాసిన ప్రతీ అక్షరం ఆయన గురించే రాసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.టీడీపీ ప్రభుత్వ హయంలో ఏపీలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించారని విమర్శించారు.
ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి ప్రజలను నాశనం చేశారని మండిపడ్డారు.రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు.
ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్నే గెలిపిస్తారనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని రోజా స్పష్టం చేశారు.