టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్

ఏపీ టీడీపీ నేతలకు మంత్రి రోజా సవాల్ విసిరారు.సింబల్ పై జరిగే ఎలక్షన్లలో సీఎం జగన్ కు తిరుగులేదన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు బాలయ్యలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వస్తారా అని ప్రశ్నించారు.నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి రోజా తెలిపారు.

పులివెందులలో జగన్ ను ఓడించే వారు ఇంకా పుట్టలేదని చెప్పారు.వై నాట్ అంటున్న నేతలు ఎవరైనా దమ్ముంటే పులివెందులకు వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటూ ఆనందం పొందుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!

తాజా వార్తలు