ఏపీలో వాలంటీర్లు అంతా రాజీనామా చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Minister Dharmana Prasada Rao ) అన్నారు.వాలంటీర్లు అనే వారు లేరన్న ఆయన ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలేనని తెలిపారు.
టీడీపీ( TDP ) ఎన్ని అవమానాలు చేసినా ఐదేళ్ల పాటు వాలంటీర్లు నిలబడి పని చేశారని ఆయన పేర్కొన్నారు.అప్పుడు ఓ మాట.ఇప్పుడో మాట చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో ఎన్నికలు అయిన తరువాత రిజైన్ చేసిన వారిని తిరిగి వాలంటీర్లు( AP Volunteers )గా నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మహిళలు, రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని తెలిపారు.అదేవిధంగా తనపై పోటీ చేసే అభ్యర్థి ఏవరో కూడా జనాలకు తెలీదని వెల్లడించారు.