థియేటర్ లో ఖుషి స్పెషల్ షో చూడబోతున్న మెగాస్టార్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి విడుదల అయ్యి పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.

ఇక నూతన సంవత్సరం రానున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఖుషి సినిమాని నేడు ప్రేక్షకుల ముందుకు తిరిగి తీసుకువచ్చారు.పవన్ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా తిరిగి విడుదలవుతుందని తెలియడంతో కొత్త సినిమాకు ప్రేక్షకులు ఉత్సాహం కనబరిచిన విధంగా ఈ సినిమా చూడటానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.

ఇక ఈ సినిమా నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఖుషి సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా థియేటర్లకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా థియేటర్ కు వచ్చి స్పెషల్ షోలో అభిమానుల మధ్య కూర్చొని ఖుషి సినిమాని చూడబోతున్నట్టు సమాచారం.

నగరంలోని ఏఎంబి మల్టీప్లెక్స్ థియేటర్లో చిరంజీవి ఈ సినిమాని వీక్షించనున్నారని తెలుస్తోంది.

Advertisement

ఇక చిరంజీవితో పాటు వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబి,అలాగే యంగ్ హీరోలు అయినటువంటి నిఖిల్ నితిన్ వంటి హీరోలు కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ సినిమా చూడబోతున్నారట.ఇద్దరు హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కు ఎంతటి అభిమానులో మనకు తెలిసిందే.అందుకే వీరందరూ కలిసి అభిమానులతో పాటు ఖుషి సినిమా చూడబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా జనవరి 13వ తేదీ విడుదల కానుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగానే ఇలా చిరు అభిమానుల మధ్య థియేటర్లో ఈ సినిమా వీక్షించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు