మెగాస్టార్‌ గారు మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు.. ఇప్పుడేం జరుగుతుంది మాస్టారు?

మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న సినిమాలు ఆయన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.ఇదే సమయం లో వారిని కన్ఫ్యూజన్ లోకి నెట్టి వేస్తున్నాయి.

ఆనందం ఎందుకంటే ఒకేసారి చిరంజీవి ఇన్ని సినిమాలు చేస్తున్నాడు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంటున్నారు.ఇదే సమయంలో సినిమాలకు సంబంధించిన విడుదల తేదీల విషయాల పట్ల ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు.

అంటే గాడ్ ఫాదర్, భోళా శంకర్‌ మరియు వాల్తేరు వీరన్న ఈ మూడు సినిమాలను కూడా సమాంతరంగా షూటింగ్ చేస్తూ ఏ సినిమా ఎంత వరకు పూర్తయిందని విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్‌ సినిమాల విషయంలో దర్శకులు ఇద్దరు కూడా క్లారిటీ ఇవ్వకుండా తాము ముందు వస్తామంటే తాము ముందు వస్తామని ప్రకటనలు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు వస్తుంది అనేది మాత్రం స్పష్టత లేదు.ఆచార్య సినిమా విడుదలైతే తప్పితే ఆ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదలవుతుంది అనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఇంతలోనే బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగు కూడా ముగింపు దశకు వచ్చిందని యూనిట్ సభ్యులు ప్రకటించారు.

దాంతో మూడు సినిమాల్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ మెగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.ఈ మూడు సినిమాల్లో ఏది ముందు ఏది తర్వాత అనే విషయంలో క్లారిటీ కోరుతున్నారు.ఇప్పటికైనా వెంటనే సినిమాల విడుదలకు సంబంధించిన డేట్లను అనౌన్స్ చేయాలంటూ మెగాస్టార్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆచార్య విడుదల తర్వాత ఆ సినిమాల విడుదల తేదీల గురించి ఒక స్పష్టత ను మెగాస్టార్ చిరంజీవి ఇస్తారేమో చూడాలి.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

తాజా వార్తలు