నాగార్జున 'బ్యానర్'లో భారీ పారితోషికం తీసుకోనున్న మెగా హీరో?

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున తన బ్యానర్ లో మరో మెగా హీరోకి భారీ పారితోషకం అందిస్తున్నట్లు తెలిసింది.

నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పటివరకు ఏ హీరోలు సినిమాలు తెరకెక్కకపొగా ఇటీవలే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అంతేకాకుండా వెబ్ సిరీస్ లకు కూడా అన్నపూర్ణ స్టూడియో అవకాశం ఇచ్చింది.ఇక ఈ బ్యానర్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నాడు.

తన తొలి సినిమా ఉప్పెన సినిమాతో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక వైష్ణవ్ తేజ్ కృషి జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.అంతేకాకుండా వెంకీ కుడుముల తన దర్శకత్వంలో కూడా వైష్ణవ్ తేజ్ కోసం స్క్రిప్ట్ను సిద్ధం చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఈయనకు పలువురు నిర్మాతల నుండి భారీ ఆఫర్లు రావడంతో వైష్ణవ్ కు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తుంది.ఇక తాజాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాలో నటించాడు.ఇదిలా ఉంటే అక్కినేని బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించే ఓ సినిమాలో వైష్ణవ్ తేజ్ కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుందట.

ఈ సినిమాను పృథ్వి అనే యువ దర్శకుడు తొలిసారిగా తన దర్శకత్వంతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలియగా ఇందుకోసం వైష్ణవ్ తేజ్ కు నాగార్జున ఐదు కోట్ల రూపాయల భారీ పారితోషకాన్ని ఇస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి అతి తక్కువ సమయంలో వైష్ణవ్ తేజ్ భారీ పారితోషికం అందుకోగా త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు