ఏపీ టూరిజం మంత్రి రోజా తన అధినేత, ఏపీ సీఎం జగన్ను ఆకట్టుకోవడం కోసం సమయం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మాటల దాడి చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా నాగాబాబు రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మెగా బ్రదర్స్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే రోజా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేయడంపై ఆయన అభిమానులు భగ్గుమంటున్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు భావోద్వేగాలు లేవని రోజా ప్రెస్మీట్లో పేర్కొన్నారు.“సాధారణంగా నటీనటులు సెన్సిటివ్, ఎమోషనల్గా ఉంటారు.
MGR, జయలలిత, ఎన్టీఆర్ వంటి దిగ్గజాలు ప్రజల నుండి చాలా గౌరవం పొందారు.కానీ చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబులకు ఎలాంటి ఎమోషన్స్ లేవు అందుకే ముగ్గురు అన్నదమ్ములను సొంత నియోజకవర్గాల్లోనే ప్రజలు తిరస్కరించారు అని రోజా అన్నారు.
చిరును విమర్శించినందుకు మెగా బ్రదర్ నాగబాబు రోజాకు కౌంటర్ ఇస్తూ ఆమె నోరు డస్ట్బిన్తో సమానం అంటూ ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు రోజాపై రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ మంత్రి రోజా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.పలుచోట్ల ఆమె దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు.రోజా పవన్ కళ్యాణ్ను విమర్శించడం రాజకీయం అయినప్పటికీ , చిరును వివిదాంలోకి లాగడం పూర్తిగా అనవసరమని మెగా అభిమానులు అన్నారు.
రోజా చిరు పేరును అనవసరంగా లాగడంపై మెగా అభిమానులే కాదు వైసీపీ నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు.రాజకీయంగా కాపులను పూర్తిగా దూరం చేయడానికే చిరంజీవిని టార్గెట్ చేయాలని వైసీపీలోని కాపు నేతలు కొందరు అన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy