రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో నకిలీ చాక్లెట్స్ తయారీ

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ లో నకిలీ చాక్లెట్స్ తయారీ దందా జోరుగా కొనసాగుతోంది.ప్రమాదకరమైన రసాయనాలతో చాక్లెట్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే హైదర్ గూడలో ఈ దందా సాగుతుందని తెలుస్తోంది.పరిశ్రమలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.

కుళ్లిన చింతపండు గుజ్జుతో ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నకిలీ చాక్లెట్లను విక్రయిస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా చాక్లెట్ల తయారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత

తాజా వార్తలు