మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత ‘ సౌర్య ‘ గా రాబోతున్నాడు.ఈ సినిమా ని మార్చ్ 4 న విడుదల చెయ్యడానికి సిద్దమవుతున్నారు.
అయితే ఎన్నడూ లేనంతగా దాదాపు 1000 థియేటర్ లలో మనోజ్ సినిమా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.డైరెక్టర్ దశరథ్ నాగార్జున తో గ్రీకువీరుడు ప్లాప్ కొట్టిన తరవాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే.ఈ సినిమాతో మళ్ళీ తన డైరెక్టటోరియల్ స్టామినా పెంచుకోవాలని ఆయన ఆరాట పడుతున్నారు.
ఫామిలీ కథాంశం తో పూర్తి థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం రాబోతోంది.
మంచు మనోజ్ ఈ మధ్యనే ఈ విషయం లో మీడియా తో మాట్లాడుతూ కథ చెప్పిన మొదటి సిట్టింగ్ లోనే ఓకే చేసేసాను అనీ తనకి కథ అంతగా నచ్చింది అనీ చెప్పారు.ప్రొడ్యూసర్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని భారీ బడ్జెట్ తో తీసారు అని మనోజ్ అంటున్నాడు.
దశరథ్ కెరీర్ కీ మనోజ్ కెరీర్ కీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం.ఈ సినిమా లో ప్రభాస్ సీను క్యారెక్టర్ చాలా కామెడీ పండిస్తుంది అంటున్నారు.
బ్రహ్మానందం – ప్రభాస్ శీను ల మధ్యన ఒచ్చే సన్నివేశాలు బాగా ఒచ్చాయి అని తెలుస్తోంది.