ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీబీఐ అరెస్ట్ తో పాటు దర్యాప్తును సవాల్ చేస్తూ సిసోడియా ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు.
సిసోడియా పిటిషన్ ను విచారించేందుకు అంగీకారం తెలిపిన న్యాయస్థానం మధ్యాహ్నం 3.50కి విచారణ చేస్తామని తెలిపింది.మరోవైపు సిసోడియాను ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది.
మద్యం కుంభకోణంలో పలు అంశాలపై సిసోడియాను అధికారులు ప్రశ్నించనున్నారు.