కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి విదితమే.ఈ వైరస్ బారిన పడకుండా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఈ వైరస్ సోకిన వారిని, లక్షణాలు కలిగిన వారిని ఐసోలేషన్ వార్డుల్లో, క్వారంటైన్లో పెడుతున్నారు.వారి నుండి ఇతరులకు వైరస్ సోకకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతడిని క్వారంటైన్లో పెట్టారు.24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి రావడంతో అతడిని క్వారంటైన్లో పెట్టారు.అయితే ఆ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని పారిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అతి కష్టం మీద అతడిని, అతడి ప్రియురాలిని పట్టుకోగలిగారు.
వారిద్దరినీ తీసుకొచ్చి క్వారంటైన్లో పడేశారు.
ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడినందుకు ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇలా క్వారంటైన్ కేంద్రాల నుండి పారిపోతున్న వారు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.ఇలాంటి వారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తు్న్నారు.