ఆ హీరోయిన్ కు పోటీగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన మహేష్ హీరోయిన్?

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతూ ఉంటారు.ఈ విధంగా వ్యాపార రంగంలో కూడా తమదైన శైలిలో దూసుకుపోతూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు.

 Mahesh Heroine Who Entered The Business To Compete With That Heroine , Mahesh Ba-TeluguStop.com

అయితే ఇలా బిజినెస్ రంగంలో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా మేమేం తక్కువ కాదన్నట్టు బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే సమంత, రకుల్, కాజల్ వంటి అగ్రతారలు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు.

తాజాగా ఈ కోవలోకి మరొక హీరోయిన్ చేరిపోయింది.మహేష్ బాబు సరసన నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతిసనన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకునే బిజీగా ఉన్నారు.

ఈ విధంగా ఒక వైపు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూనే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Gym, Kriti Sanon, Mahesh Babu, Telugu, Tribe-Movie

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే ఎఫ్‌ 45 పేరుతో హైదరబాద్‌తో పాటు వైజాగ్‌ లో జిమ్ లను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ కి పోటీగా కృతిసనన్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి  ది ట్రైబ్‌ అనే జిమ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.అనుష్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి ఒక వ్యాపారవేత్తగా ది ట్రైబ్‌ను లాంచ్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా తన బిజినెస్ గురించి కృతి సనన్ వెల్లడించారు.

ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రభాస్ సరసన ఆది పురుష్ చిత్రంలో సీత పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube