సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”( Guntur karam ).మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల ( Pooja Hegde, Srileela )హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే షూట్ త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని మేకర్స్ ఆలోచన.
ఇటీవలే కృష్ణ గారి జయంతి ( Krishna’s birthday )సందర్భంగా మాస్ స్ట్రైక్ అంటూ వీడియో, టైటిల్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఈ మాస్ స్ట్రైక్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.
దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరింత ఎదురు చూడడం స్టార్ట్ చేసారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ సమ్మర్ ముందు ఆగిపోయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ లాస్ట్ లో ఆగిపోయిన షూట్ ను మళ్ళీ ఈ నెలలో కొత్త షెడ్యూల్ తో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.జూన్ 10 నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని టాక్ వస్తుంది.
ఇది భారీ షెడ్యూల్ అనే తెలుస్తుంది.మరి ఇందుకోసం మహేష్ పక్కా ప్లాన్ తో రెడీ కూడా అవుతున్నాడట.
ఈ షెడ్యూల్ ను జూన్ 10న స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి కల్లా పూర్తి కావాలని టీమ్ ను మహేష్ కోరారట.అందుకే మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా ఎక్కడ మిస్ అయ్యి షూటింగ్ గ్యాప్ రాకుండా పక్క ప్రణాళికతో మహేష్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడట.మొత్తానికి జూన్ 10న స్టార్ట్ అయితే అక్టోబర్ ఎండింగ్ వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా ఎలా మ్యానేజ్ చేస్తారో వేచి చూడాలి.