సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారి బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు ఒకే చెప్పాడు.కానీ కథ ఒకే కాకపోవడంతో మహేష్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు సిద్ధం అయ్యాడు.
ఆ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నట్లుగా వార్తలు వచ్చాయి.అసలు సుకుమార్ సినిమాను మహేష్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం దిల్ రాజు అనే పుకార్లు కూడా పుట్టుకు వచ్చాయి.
దిల్ రాజు తన బ్యానర్ లో ఈ సినిమాను చేయాలని భావించినా కూడా మహేష్ బాబు మాత్రం అనిల్ సుంకర బ్యానర్ లో సినిమాను చేయాలని చాలా రోజుల నుండి భావించాడు.అందుకే ఈ సినిమా నిర్మాణ బాధ్యతను అనిల్ సుంకరకు అప్పగించినట్లుగా సమాచారం అందుతోంది.ఈ విషయం పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.అతి త్వరలోనే సినిమాను పట్టాలెకించే అవకాశం ఉంది.
మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న 25వ మూవీ మహర్షి ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.ఆ సినిమా పైనే ప్రస్తుతం మహేష్ పూర్తి దృష్టిని పెట్టాడు.ఏప్రిల్ తర్వాత అనిల్ రావిపూడి తో సినిమా ఉండనుంది.ఎఫ్2 సినిమాతో రచ్చ చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు ఫుల్ కామెడీ మూవీని ఇవ్వబోతున్నాడు అంటూ అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.