నేటి నుండి ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ కావడం జరిగింది.అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై జట్లు తలపడుతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) (CSK) కి మహేంద్రసింగ్ ధోని నాయకత్వం వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే ధోని హిస్టరీ క్రియేట్ చేశారు.
విషయంలోకి వెళ్తే ఐపీఎల్ లో అత్యంత పెద్ద వయస్కూడైన కెప్టెన్ గా నిలిచారు.ధోని ప్రస్తుత వయస్సు 41 సంవత్సరాల 265 రోజులు… కావటంతో ఐపీఎల్ లో అత్యంత ఓల్డెస్ట్ కెప్టెన్ గా నిలవడం జరిగింది.
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మాజీ క్రికెటర్ దివంగత షేన్ వార్న్( Shane Warne ) పేరిట ఉంది.అప్పట్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా 41 ఏళ్ల 249 రోజుల అత్యంత ఓల్డెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు.
అయితే ఇప్పుడు ఆ రికార్డును గుజరాత్ తో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని బ్రేక్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ధోని ఆడే చివరి ఐపీఎల్ ఇదే అని వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత … ధోని ఆడడని సమాచారం.సో చివరి ఐపీఎల్ కావడంతో ఎలాగైనా టైటిల్ గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని.
ధోని ఉన్నారట.