ఐపీఎల్-2023 ఈ సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ప్రారంభం అవుతుంది.ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ కనీసం రెండు నెలలు కొనసాగనుంది.
ఈ మెగా టోర్నీ కోసం మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి నుంచే సిద్ధం అవడం ప్రారంభించాడు.ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ధోని నెట్స్లో భారీ సిక్సర్లను కొట్టడం చూడవచ్చు.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు ధోని సిక్స్లు కొడుతున్న వీడియోను చూసి ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైర్ అయిపోయాడు.
అయితే కేవలం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం మాత్రమే ఆడుతున్నాడు.2020 ఆగస్టులోనే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.అతను గత సంవత్సరం జడేజాను చెన్నై కెప్టెన్గా నియమించడం వల్ల ఐఫీఎల్ నుంచి రిటైర్ అవుతాననే సంకేతాలు పంపాడు.అయితే చెన్నై కెప్టెన్గా జడేజా పూర్తిగా విఫలమయ్యాడు.
దీని తరువాత, ధోని తన ఐపీఎల్ రిటైర్మెంట్పై ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు.అయితే ప్రస్తుత సీజన్ చివరిదని తెలుస్తోంది.
ఈ తరుణంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, ధోని స్పిన్ బౌలర్లకు వ్యతిరేకంగా భారీ సిక్సర్లను కొట్టడం చూడవచ్చు.న్యూజిలాండ్తో జరిగిన మొదటి టి 20 మ్యాచ్కు ముందు ధోని ఇటీవల భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లను కలిశారు.అతను శుభ్మన్ గిల్, యుజ్వేంద్ర చాహల్, అసోసియేట్ సిబ్బందితో సంభాషించాడు.హార్డిక్ పాండ్యా కూడా తన అభిమాన ఆటగాడు ధోనితో చాలా సేపు మాట్లాడాడు.మ్యాచ్కు ముందు ధోనితో సమావేశంపై హార్డిక్ చాలా సంతోషించాడు.భారత జట్టు విజయానికి ధోని అందించిన సలహాలపై క్రికెటర్లు చాలా ఆనందంతో గడిపారు.