2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో జాయిన్ అయినా మాదాసు గంగాధరం.పార్టీలో కీలకంగా రాణించడం తెలిసిందే.పార్టీ అఫైర్స్ కమిటీ బాధ్యతలు కూడా స్వీకరించి అప్పట్లో. జనసేన కోసం చాలా చురుగ్గా పనిచేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి తాడేపల్లి లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై మాదాసు గంగాధరం సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కి జనసేన అనుకూలం కాదని.ప్రకటన చేయాలని పవన్ కి చాలా సార్లు చెబితే ఆయన వినలేదు అని పేర్కొన్నారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకుని ప్రభుత్వంపై పవన్ విమర్శలు చేస్తారు తప్ప ఆయన కంటూ సొంత జ్ఞానం లేదని తెలిపారు.ఆయనను నమ్ముకుని కొంతమంది ఉద్యోగస్తులు.
ఉద్యోగాలు వదులుకుని రాజకీయాలలోకి వచ్చారు, కానీ వారిని నట్టేట ముంచారని గంగాధరం సంచలన వ్యాఖ్యలు చేశారు.నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ ని తప్పుదోవపట్టించే రీతిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశం పవన్ కి ఏ మాత్రం లేదని.ఎవరో రాసిన వాటిని పట్టుకొని ప్రభుత్వంపై కావాలని బురద జల్లే కార్యక్రమాలు చేయడం తనకు నచ్చక.
కొద్ది నెలల నుండి జనసేన కి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.