లోక్సభ ఎన్నికల నాల్గవ విడత నోటిఫికేషన్( Lok Sabha Elections Fourth Phase Notification ) విడుదలైంది.ఈ మేరకు తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక( Secunderabad Cantonment Assembly Election )కు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.ఇక ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ( Nominations Process ) సాగనుంది.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన కొనసాగనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29 వరకు ఉంది.
అదేవిధంగా మే 13న పోలింగ్ నిర్వహణ ఉండనుండగా.జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడి కానున్నాయి.







