ఇదేందయ్యా ఇది : లాక్ డౌన్ కారణంగా భార్య పుట్టింట్లో ఉందని రెండో పెళ్లి చేసుకున్న భర్త...  

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఓ మహిళ తన పుట్టింటికి వెళ్ళిన అనంతరం లాక్ డౌన్ విధించడంతో తన భర్త ఇంటికి తిరిగి రాలేక పోయింది.

దీంతో ఎన్నిసార్లు పిలిచినా భార్య రాకపోవడంతో ఆ భర్త ఏకంగా రెండో పెళ్లి చేసుకొని మొదటి భార్య కి షాక్ ఇచ్చిన ఘటన దేశంలోని బీహార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్ర రాజధాని పాట్నా నగరంలో ధీరజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

అయితే ఇటీవలే ధీరజ్ స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.అయితే ధీరజ్ భార్య తన తల్లిదండ్రులను చూసేందుకు తన పుట్టింటికి వెళ్ళింది.

అయితే ఆమె పుట్టింటికి వెళ్ళిన అనంతరం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు.దీంతో యువతి తిరిగి తన భర్త ఇంటికి రాలేకపోయింది.

Advertisement

ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా తన భార్యను తన ఇంటికి రావాలంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆమె తన భర్త ఇంటికి వెళ్ళలేకపోయింది.దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ధీరజ్ వెంటనే గతంలో తాను ప్రేమించినటువంటి ప్రేయసిని ఇంటికి పిలిపించాడు.

అంతేగాక ఏకంగా ఆమెను పెళ్ళికూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ధీరజ్ మొదటి భార్య లబోదిబోమంటూ తనకు న్యాయం చేయాలని పోలీసులను సంప్రదించింది.

అయితే ధీరజ్ మొదటి భార్య తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ధీరజ్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు