తెలంగాణలో ప్రభుత్వం కేసులను తక్కువగా చూపించేందుకు కావాలని టెస్టులను తక్కువగా చేసి చూపిస్తుంది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు లక్ష ఇరువై అయిదు వేల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు.
కాని తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు 20 వేల లోపు మాత్రమే కరోనా టెస్టులు చేశారు.ఇంత తక్కువ మందికి టెస్టులు నిర్వహించడంకు గల కారణం ఏంటీ అనేది సామాన్యులకు అర్థం కాని ప్రశ్న.
అనుమానం ఉన్న వారిని మాత్రమే టీ ప్రభుత్వం టెస్టులు నిర్వహిస్తుంటే ఏపీలో మాత్రం ఏదైనా ఏరియాలో కేసు నమోదు అయితే అక్కడ అందరిని కూడా టెస్టులకు పిలుస్తుందట.
ఏపీలో కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తున్న కారణంగా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
ఇది మంచి పరిణామం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే తెలంగాణలో కూడా ప్రభుత్వం కరోనా నివారణకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
టెస్టులు నిర్వహించనంత మాత్రాన ప్రభుత్వంను తప్పుబట్టాల్సిన అవసరం లేదంటూ కొందరు అంటున్నారు.మొత్తానికి ఏపీ మరియు తెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో తెలుగు జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉండగా ఇప్పుడు ఏపీ ముందు నిలబడినది.
నిన్నటి లెక్కల ప్రకారం ఏపీలో 1,25,299 మందికి టెస్టులు నిర్వహించగా 1650 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.524 మంది రికవరీ అవ్వగా ప్రస్తుతం 1093 మంది మాత్రం చికిత్స పొందుతున్నారు.ఇక ఏపీలో మొత్తంగా 33 మంది మృతి చెందారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం 19,278 మందికి పరీక్షలు నిర్వహించగా 1085 కేసులు నమోదు అయ్యాయి.585 మంది రికవరీ అవ్వగా ప్రస్తుతం 471 మంది గాంధీలో చికిత్స పొందుతున్నారు.తెలంగాణలో కరోనా కారణంగా 29 మంది మృతి చెందారు.
.