కర్నూలు జిల్లా మద్దికెర మండలం బసినేపల్లి గ్రామంలో ఓ రైతును అదృష్టం వరించింది పొలం పనులు చేస్తుండగా రెండు కోట్లు విలువ చేసే వజ్రం ఆ రైతుకు దొరికింది.అయితే దీనిని వ్యాపారు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
బహిరంగ మార్కెట్లో దీని విలువ ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని చర్చించుకుంటున్నారు.
రెవిన్యూ అధికారులు కానీ, పోలీసులు కాని, అటువైపు చూడకపోవడం వ్యాపారుల పంట పండి కోట్లకు పడగలెత్తుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.