శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంను పరీశీలించిన కేఆర్ఎంబి బృందం

కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల పరీశీలనలో బాగంగా కృష్ణానది యాజమాన్యం బోర్డు కేఆర్ఎంబి బృందం శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించింది.జిల్లాలో రెండు రోజులగా పర్యటనలో బాగంగా మొదటి రోజు హంద్రినివా మల్యాల పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసి ప్రధాన కాల్వలను పరిశీలించారు.

 Krmb Team Inspects Srisailam Kudigattu Hydroelectric Power Station, Krmb , Inspe-TeluguStop.com

రెండవ రోజు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ కుడిగట్టు జలవిద్యుత్ కేంధ్రాలను పరిశీలించారు.

ఏపి కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి దాని వినియోగం వార్షిక బడ్జట్ ఉద్యోగుల వివరాను ఏపి జన్ కో చీప్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సున్నిపెంటలోని జెన్ కో కాలనిలోని గృహాలను పరిశీలించారు.ప్రాజెక్టు కాలనీలోని నీటిపారుదలశాఖ కార్యాలయంను సందర్శించి డ్యామ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టులు ప్రధాన కాలువల పర్యటనలో బాగంగా శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంను పరీశీలించి అధికారులతో చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నామని కేఆర్ఎంబి బృందం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube