కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టుల పరీశీలనలో బాగంగా కృష్ణానది యాజమాన్యం బోర్డు కేఆర్ఎంబి బృందం శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించింది.జిల్లాలో రెండు రోజులగా పర్యటనలో బాగంగా మొదటి రోజు హంద్రినివా మల్యాల పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసి ప్రధాన కాల్వలను పరిశీలించారు.
రెండవ రోజు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ కుడిగట్టు జలవిద్యుత్ కేంధ్రాలను పరిశీలించారు.
ఏపి కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి దాని వినియోగం వార్షిక బడ్జట్ ఉద్యోగుల వివరాను ఏపి జన్ కో చీప్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సున్నిపెంటలోని జెన్ కో కాలనిలోని గృహాలను పరిశీలించారు.ప్రాజెక్టు కాలనీలోని నీటిపారుదలశాఖ కార్యాలయంను సందర్శించి డ్యామ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కర్నూలు జిల్లాలోని నీటి ప్రాజెక్టులు ప్రధాన కాలువల పర్యటనలో బాగంగా శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంను పరీశీలించి అధికారులతో చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నామని కేఆర్ఎంబి బృందం తెలిపారు.