తెలుగులోని సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరనే సంగతి తెలిసిందే.కృతిశెట్టి నటిస్తే సినిమా హిట్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఆ టాక్ కు అనుగుణంగా కృతిశెట్టి హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్య సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెమ్యునరేషన్ కారణమని సమాచారం.
కృతిశెట్టికి తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కళ్లు చెదిరే మొత్తం ఆఫర్ చేశారని తెలుస్తోంది.కృతిశెట్టికి కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కనుండగా ఇప్పటివరకు కృతిశెట్టి అందుకున్న మొత్తంతో పోల్చి చూస్తే ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ కావడం గమనార్హం.18 సంవత్సరాల తర్వాత సూర్య బాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
సూర్య నటించి ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ఆకాశమే నీహద్దురా, జైభీమ్ సినిమాలు హిట్టైనా ఆ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి.సూర్య నటించిన ఈటీ గత నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

సూర్య రొటీన్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమిళ దర్శకుడు బాల విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే బాల కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ సాధించలేదు.
సూర్య కృతిశెట్టి బాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.సూర్య ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







