మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా కోడలిగా, అపోలో హాస్పిటల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి మనందరికీ తెలిసిందే.
ఈమె ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే, మరొకవైపు అపోలో హాస్పిటల్ కు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉంటుంది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన.
ఈ నేపథ్యంలో తన అత్తింటివారి విషయాలను, తన పుట్టింటి వారి సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యింది.
ఇండియన్ ఎక్స్పో 2020లో భాగంగా ఈ సమావేశం జరిగింది.ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది ఉపాసనా.
ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ ఇండియన్ ఎక్స్ పో 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసాను.ఆవిష్కరణ అలాగే ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగు పరచడం కోసం, మహిళా సాధికారత సంస్కృతి పరిరక్షణ మీద దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు.
అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది.వాటిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అంటూ ఉపాసన ట్వీట్ లో రాసుకొచ్చింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒకవైపు మెగా కోడలిగా, రామ్ చరణ్ సతీమణిగా, పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.ఇదే కాకుండా ఇటీవల హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్న విక్కీ, లక్ష్మి అనే రెండు ఆసియా సింహాలనూ కూడా దత్తతు తీసుకుంది.అలాగే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఫిట్నెస్ గురించి, ఆయుర్వేదం గురించి, జంతువుల సంరక్షణ గురించి, క్యాన్సర్ గురించి సూచనలు ఇస్తూ ఉంటుంది.