ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందగా ఆయన మరణం ఫ్యాన్స్ ను చాలా బాధ పెట్టింది.వైఎస్సార్ మరణించారనే వార్తను విని తట్టుకోలేక ఆయన అభిమానులలో చాలామంది మృతి చెందారు.
ఈ హెలికాఫ్టర్ ప్రమాదం విషయంలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి.అయితే అన్ స్టాపబుల్ షోలో హెలికాఫ్టర్ ప్రమాదం గురించి మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
ప్రోమోలో నేను బ్రతికున్నా కాబట్టే సీఎం అయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.ఎపిసోడ్ లో రాజశేఖర్ రెడ్డి ప్రయాణం చేసిన హెలికాఫ్టర్ లో నేను కూడా ప్రయాణం చేయాల్సి ఉందని అయితే వేరే పని వల్ల కుదరలేదని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
అలా జరగకుండా ఉండి ఉంటే ఆ ప్రమాదంలో నేను కూడా మరణించి ఉండేవాడినని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ ల విషయంలో ప్రేక్షకుల్లో అభ్యంతరాలు ఉన్నాయి.
కుటుంబంలోనే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న స్టార్ హీరోలు ఉన్నా బాలయ్య మాత్రం వాళ్లను ఈ షోకు ఆహ్వానించకుండా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య షోకు తారక్ హాజరైతే ఆ హంగామా మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే.
బాలయ్య తారక్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.బాలయ్య తారక్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు.త్వరలో వాళ్లిద్దరి మధ్య గ్యాప్ తొలగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య తారక్ కలిస్తే నందమూరి అభిమానులు సైతం సంతోషించే అవకాశం అయితే ఉంది.బాలయ్య తారక్ కాంబోకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.