ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు పెళ్లి బంధంతో ఒకటి కాగా తాజాగా మరొక బ్యూటీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి కియారా అద్వానీ త్వరలోనే తాను ప్రేమించిన వ్యక్తి బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వీరిద్దరూ గత కొంతకాలం నుంచి డేటింగ్ లో ఉన్నారని విషయం మనకు తెలిసిందే.
ఇక వీరి వ్యవహారాన్ని కూడా ఈ జంట పరోక్షంగా ఒప్పుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాదిలోని వీరి వివాహం జరగబోతున్నట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఈ విషయాలపై నటి కియారా ఏ విధంగానూ స్పందించలేదు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తుంటే త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుందని అర్థమవుతుంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కియరా స్పందిస్తూ ఇక ఈ విషయాన్ని దాచలేకపోతున్నాను డిసెంబర్ రెండవ తేదీ వరకు వేచి ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.
దీంతో ఈమె పెళ్లి తేది డిసెంబర్ రెండవ తేదీ ప్రకటించబోతుందని ఈమె పెళ్లి కూడా ఈ డిసెంబర్ 5వ తేదీ చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని ఈమె అధికారికంగా వెల్లడించబోతున్నట్లు ఈ పోస్ట్ చూస్తుంటేనే అర్థమవుతుంది.ఇలా ఈమె తన పెళ్లి గురించి దాదాపుగా కన్ఫామ్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.