టీడీపీ నేత బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు రూ.250 కోట్లతో స్కెచ్ వేసి రెక్కీ నిర్వహించారని ఆరోపించారు.ప్రాణాలు తీయాలనే చంద్రబాబు కాన్వాయ్ పై కూడా దాడి చేయించారని విమర్శించారు.
విశాఖలో భూ కబ్జాలపై ప్రశ్నించినందుకే అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పవన్ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్తులు చేసిన నేరమా అని ప్రశ్నించారు.
దాడులు, కూల్చివేతలు, తప్పుడు కేసులే జగన్ విధానమని తీవ్ర ఆరోపణలు చేశారు.ప్రతి శుక్రవారం, శనివారం జేసీబీలకు జగన్ పని కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.