కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

టీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

ఇప్పటివరకు స్థానిక నేతలను కొనుగోలు చేశారన్న ఆయన ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.ఇది రాజకీయ వికృత క్రీడకు పరాకాష్ట అని వ్యాఖ్యనించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ బాటలో బీజేపీ నడుస్తోందని విమర్శించారు.ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు