తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ వాయిదా పడింది.ఈనెల 21న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్షను ఈనెల 28న నిర్వహించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది.
సాంకేతిక కారణాల దృష్ట్యా పరీక్షను వాయిదా వేసినట్లు వెల్లడించింది.అయితే, ఈ కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు తెలిపారు.