పగ తీర్చుకుంటానంటున్న కీర్తి సురేష్.. కారణమేమిటంటే?

కీర్తి సురేష్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నేను శైలజ అంటూ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ ఆతర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది.మహానటి సావిత్రిగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక కరోనా వైరస్ లాక్ డౌన్లోను ఓటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో ఎంతో ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.అయితే మహానటి కీర్తి సురేష్ బాగా అలసిపొయ్ సినిమా షూటింగ్ లోనే నిద్రపోయింది.

Advertisement

ఆలా సెట్ లో నిద్రపోతున్న కీర్తి సురేష్ ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ అయ్యింది.ఏంటి కీర్తి హీరోను, నిర్మాతను, డైరెక్టర్ ను పక్కన పెట్టుకొని అలా నిద్రపోతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేసి ఆమె పరువును గంగలోకి కలిపేశారు అంటే నమ్మండి.

నిజానికి ఆ ఫోటోను హీరో నితిన్ షేర్ చేశారు.షూటింగ్ లో వారికీ చెమటలు పడుతుంటే కీర్తి సురేష్ మాత్రం ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవుతోంది అంటూ నితిన్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కీర్తి సురేష్ కూడా స్పందించించి.షూటింగ్ సెట్స్‌‌లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా.

పగ తీర్చుకుంటానని అంటూ కామెంట్ చేసింది.ఇంకా దుబాయ్ లో జరిగిన షూటింగ్ లో ఫన్నీ మూమెంట్స్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు